top of page

Hi, I’m Vinod
Mamidala
Author & Journalist
vinoo

About
Vinod Mamidala
Vinod Mamidala is a young journalist And Author from the state of Telangana. At the age of 25, he authored a book titled "Aame," which focused on women's success stories. The book received widespread recognition and praise for its inspiring portrayal of strong women and their achievements.

ఈ పుస్తకాన్ని కేవలం ఆయా ప్రదేశాల గురించి చెప్పడంతో సరిపుచ్చలేదు వినోద్. వారణాసి పర్యటించాలన్న ఆకాంక్షకు గల మూలాలతో మొదలు పెట్టి అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ, ఆయా సందర్భాలలో తన ఆలోచనల పరంపరను, అనుభూతుల సాంద్రతను మనతో పంచుకుంటాడు. పాఠకుడితో ముచ్చట చెబుతున్నట్టుగా తన అనుభవాలని సృజిస్తాడు. ఈవిధమైన రచనా సంవిధానంలో అతను ఒక్కోసారి ఒక్కోవిధంగా దర్శనమిస్తాడు. ఒక పర్యాటకుడిగా, ఒక కథకుడిగా, నవలాకారుడిగా, యాత్రాచరిత్ర రచయితగా, పాత్రికేయునిగా, కుటుంబం పట్ల, మిత్రుల పట్ల ఆపేక్ష కలిగిన కొడుకుగా, అన్నగా, తమ్మునిగా, మిత్రునిగా కనిపిస్తాడు.
–ముందుమాటలో గుడిపాటి,
ప్రముఖ సాహిత్య విమర్శకులు
సాధారణ పాఠకులుసైతం ఆసక్తిగా తెలుసుకోదగ్గ విషయాలు అనేకం ఈ పుస్తకంలో రచయిత పొందుపరిచారు. అక్కడి భక్తి ప్రవాహ తాదాత్మ్య ఆత్మానుభూతినీ తాను వదలలేదు. వినోద్ ఒక సహేతుక వాదిగా ఈ యాత్రా పుస్తకం ద్వారా పాఠకులకు పరిచయమవుతారు. 'వితండ నాస్తిక' అవలక్షణాలేవీ తాను ప్రదర్శించలేదు. ఈ పుస్తకం కేవలం భక్తిభావాలుగల పాఠకుల కోసమే అనుకొంటే పొరపాటు. ఈ దేశంలోని సామాన్య ప్రజలంతా విధిగా తెలుసుకోదగ్గ సుప్రసిద్ధ కాశీ పట్టణ వీధుల జీవనశైలి, ఆ మట్టి అణువణువులో నిక్షిప్తమైన గొప్పతనం, అన్నింటినీ మూటగట్టి వినోద్ చాలా సరళంగా అక్షరబద్ధం చేసి మనకందించారు. నావలె మీరంతా కూడా ఆలస్యం చేయకుండా ఆస్వాదించండి.
– దోర్బల బాలశేఖరశర్మ,
సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత
మనుషుల జీవితాలకూ ఈ బుక్ లో రచయిత చోటిచ్చాడు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ల మీద, దుకాణాల పక్కన ప్రపంచాన్ని మరిచి నిద్రపోతున్న వాళ్ల గురించి, కాషాయ వస్త్రాలు ధరించి ముడతలు పడిన శరీరాలతో, అడ్డ నామాలతో, రుద్రాక్షలతో సంచరించే సాధువుల గురించీ, సారనాథ్లో తిరగాడే బౌద్ధ భిక్షువుల గురించి రాశాడు. తమిళియన్ రతన్ లాల్ గురించి, సారాయ్ మోహన గ్రామంలో నౌరద్ అన్సారీ ద్వారా చేనేత కార్మికుల బతుకు చిత్రాలను కళ్ల గట్టాడు. ఇక మాన్ సింగ్ ప్యాలెస్ లో కలిసిన 'ఇషాని జైస్వాల్' కథకు కాస్తా ఎక్కువే చోటిచ్చాడు. కుటుంబ కట్టుబాట్లను, అడ్డంకులను అధిగమించి అనుకున్న లక్ష్యం చేరిన ఈ యువతి కథ ఆలోచింపజేస్తుంది.
– మల్లేశం చిల్ల,
సీనియర్ జర్నలిస్ట్, రచయిత
Books vinoo
With his diverse writing talents and unique perspective, Vinod Mamidala had become a respected figure in the literary world. His dedication to journalism and storytelling inspired many aspiring writers, and he was poised to leave a lasting impact on the readers and the industry.



త్వరలో..
A collection of inspiring stories showcasing how embracing resilience leads to personal growth and success.
Youtube
Springin forward with passion and Freedom
Praise & Reviews
ఈ పుస్తకాన్ని కేవలం ఆయా ప్రదేశాల గురించి చెప్పడంతో సరిపుచ్చలేదు వినోద్. వారణాసి పర్యటించాలన్న ఆకాంక్షకు గల మూలాలతో మొదలు పెట్టి అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ, ఆయా సందర్భాలలో తన ఆలోచనల పరంపరను, అనుభూతుల సాంద్రతను మనతో పంచుకుంటాడు. పాఠకుడితో ముచ్చట చెబుతున్నట్టుగా తన అనుభవాలని సృజిస్తాడు. ఈవిధమైన రచనా సంవిధానంలో అతను ఒక్కోసారి ఒక్కోవిధంగా దర్శనమిస్తాడు. ఒక పర్యాటకుడిగా, ఒక కథకుడిగా, నవలాకారుడిగా, యాత్రాచరిత్ర రచయితగా, పాత్రికేయునిగా, కుటుంబం పట్ల, మిత్రుల పట్ల ఆపేక్ష కలిగిన కొడుకుగా, అన్నగా, తమ్మునిగా, మిత్రునిగా కనిపిస్తాడు.
–ముందుమాటలో గుడిపాటి, ప్రముఖ సాహిత్య విమర్శకులు
సాధారణ పాఠకులుసైతం ఆసక్తిగా తెలుసుకోదగ్గ విషయాలు అనేకం ఈ పుస్తకంలో రచయిత పొందుపరిచారు. అక్కడి భక్తి ప్రవాహ తాదాత్మ్య ఆత్మానుభూతినీ తాను వదలలేదు. వినోద్ ఒక సహేతుక వాదిగా ఈ యాత్రా పుస్తకం ద్వారా పాఠకులకు పరిచయమవుతారు. 'వితండ నాస్తిక' అవలక్షణాలేవీ తాను ప్రదర్శించలేదు. ఈ పుస్తకం కేవలం భక్తిభావాలుగల పాఠకుల కోసమే అనుకొంటే పొరపాటు. ఈ దేశంలోని సామాన్య ప్రజలంతా విధిగా తెలుసుకోదగ్గ సుప్రసిద్ధ కాశీ పట్టణ వీధుల జీవనశైలి, గంగలో పారే పవిత్రత, అక్కడి మత సామరస్యత, ఆ మట్టి అణువణువులో నిక్షిప్తమైన గొప్పతనం, గాలిలో ప్రసరించే స్ఫూర్తి.. అన్నింటినీ మూటగట్టి వినోద్ చాలా సరళంగా అక్షరబద్ధం చేసి మనకందించారు. నావలె మీరంతా కూడా ఆలస్యం చేయకుండా ఆస్వాదించండి.
– దోర్బల బాలశేఖరశర్మ, సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత
మనుషుల జీవితాలకూ ఈ బుక్ లో రచయిత చోటిచ్చాడు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ల మీద, దుకాణాల పక్కన ప్రపంచాన్ని మరిచి నిద్రపోతున్న వాళ్ల గురించి, కాషాయ వస్త్రాలు ధరించి ముడతలు పడిన శరీరాలతో, అడ్డ నామాలతో, రుద్రాక్షలతో సంచరించే సాధువుల గురించీ, సారనాథ్లో తిరగాడే బౌద్ధ భిక్షువుల గురించి రాశాడు. తాను ఎక్కిన బోటును నడిపిన తమిళియన్ రతన్ లాల్ గురించి, సారాయ్ మోహన గ్రామంలో నౌరద్ అన్సారీ ద్వారా చేనేత కార్మికుల బతుకు చిత్రాలను కళ్ల గట్టాడు. ఇక మాన్ సింగ్ ప్యాలెస్ లో కలిసిన 'ఇషాని జైస్వాల్' కథకు కాస్తా ఎక్కువే చోటిచ్చాడు. కుటుంబ కట్టుబాట్లను, అడ్డంకులను అధిగమించి అనుకున్న లక్ష్యం చేరిన ఈ యువతి కథ ఆలోచింపజేస్తుంది. పుస్తక ముగింపు తీరును బట్టి ఈ 'సోలో ట్రావెలర్' అసలు లక్ష్యమేమిటో మనకు బోధపడుతుంది.
– మల్లేశం చిల్ల, సీనియర్ జర్నలిస్ట్, రచయిత

bottom of page